రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) తెలిపింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 783 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.