Harish Rao : పీయూష్ గోయల్ చెప్పేవన్ని అబద్ధాలే : హరీష్ రావు

Harish Rao : పీయూష్‌ గోయల్ తెలంగాణ ప్రజలను అవమానపరిచారన్నారు మంత్రి హరీష్ రావు.

Update: 2022-04-01 12:00 GMT

Piyush Goyal : పీయూష్‌ గోయల్ తెలంగాణ ప్రజలను అవమానపరిచారన్నారు మంత్రి హరీష్ రావు.తెలంగాణ రైతుల గురించి పీయూష్‌ గోయల్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. గోయల్ చెప్పేవన్ని అబద్ధాలేనన్న హరీష్ రావు...ఆయనకు హుంకరింపులు, వక్రీకరణ అలవాటుగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. రైతులకు తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందో వచ్చి చూడాలన్నారు. దమ్కీలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. ఈడీ, ఐటీ దాడులతో దాడులు చేసేది కేంద్రమేనన్నారు. ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తే దమ్కీలు ఇస్తున్నారనడం సరికాదన్నారు. సమైక్య పాలకుల తరహాలోనే పీయూష్ గోయల్ కామెంట్స్ ఉన్నాయన్నారు.

Tags:    

Similar News