Harish Rao : కాళేశ్వరం కమిషన్ విచారణకు నేడు హరీష్

Update: 2025-06-09 07:15 GMT

కాళేశ్వరం కమిషన్ విచారణ అత్యంత కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ 113మందిని విచారించి సేకరించిన సమాచారంతో హరీష్ రావును కౌంటర్ విచారణ జరపనున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సేకరించిన నిధుల మళ్లింపు, కుంగుబాటుకు ఉత్పన్నమైన అంశాలు, సుందిళ్ల అన్నారం ప్రాజెక్టులో నిర్మాణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు. రిటైడ్ ఇంజనీర్ల ఫోరం నివేదికలో ఉన్న అంశాలను కౌంటర్ చెక్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే మేడిగడ్డ నిర్మాణం, నిర్మాణ వ్యయం, డిజైన్లు, మంత్రి వర్గ నిర్ణయాలు దర్యాప్తులో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తుమ్మిడిహట్టి నుంచి అంబట్ పల్లి దగ్గరలోని మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించాల్సిన అంశంపై దర్యాప్తు జరిగే అవకాశాలున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి దగ్గర 165 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ భవిష్యత్ లో మహారాష్ట్ర బ్యారేజీలు నిర్మిస్తే 63 టీఎంసీలు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్న అంశాలపై రిటైర్డ్ ఇంజనీర్లు, అధికారులు ఇచ్చిన వివరణపై కీలకంగా దర్యాప్తు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే సమగ్రమైన నివేదికలు, మహారాష్ట్రతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సెంట్రల్ డిజైన్ అనుమతులు, నీటిలభ్యత, సీడబ్ల్యూసీ నివేదిక సమాచారం. సుమారు రెండుగంటల పాటు దర్యాప్తు తో పాటు అనేక వివరాలతో హరీష్ రావు దర్యాప్తుకు సిద్ధమైనట్లు ప్రశ్నలకు ఏమేరకు హరీష్ రావు వివరణ ఇవ్వనున్నారో,మేడిగడ్డ కొనసాగుతోందని అంచనావేస్తున్నారు. అయితే జస్టీస్ అడిగే కుంగుబాటుకు ఏకారణాలను వివరించనున్నారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News