హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతోన్న వర్షం సరిగ్గా ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వర్షం రావడంతో ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నాం అని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.