తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉ.8.30 వరకుఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, WGL, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయంది.
ఈరోజు హైదరాబాద్ తో సహా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక రాష్టంలోని మిగతా అన్ని జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐదు రోజుల పాటు భారీ నుండి మోస్తరు వర్షాల నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు బలమైన ఉపరితల గాలులు గంటకు 30- నుంచి 40 కిలో మీటర్లు వీస్తాయని తెలిపింది.
మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలోఈదురు గాలులతో వర్షాలు అవకాశం ఉంది..