తెలంగాణలో మరో రెండో రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వర్షం ఏకధాటిగా కురిసే చాన్సుందని తెలిపింది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద న్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగం తో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకా శం ఉందన్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్జ్ జారీ అయింది.