బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూముల ఘటనలో నకిలీ వీడియోలు వైరల్ చేశారని పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని క్రిశాంక్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ ను విచారణకు ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నించి పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు కొణతం దిలీపు నోటీసులను జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలు వాయిదా వేసింది. అయితే ఈ ఘటనలో ఒకే విషయంలో నాలుగు కేసులను నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రమణారావు హైకోర్టుకు వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని తెలిపారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలి భూముల ఘటనపై ఏఐ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసి వైరల్ చేశారని, సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు.