హైదరాబాద్ బతుకమ్మ కుంటలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. బతుకమ్మ కుంట అభివృద్ధి చేయడానికి వచ్చామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఏ నిర్మాణాన్ని కూల్చబోమని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్మాణాలు కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.