నిజంగా కేసీఆర్ నిజాయితీ పరుడైతే కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని విజి లెన్స్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతోందన్నారు. నిజాయితీ ఉంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాల న్నారు. విచారణను పోస్టుపోన్ చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. '100 శాతం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1.47 లక్షల కోట్లు దాటిన ఖర్చులో అవకతవకలు జరిగాయి. ఈ డబ్బుతో కొందరు విదేశాల్లో సంబరాలు చేసు కుంటున్నారు. కవిత లిక్కర్ కేసు నుంచి ప్రజ ల్ని దృష్టి మరల్చే బీఆర్ఎస్ డ్రామా చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల రూ. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మూడేండ్లలో నిరుపయోగమైంది. దీనిపై విచారణను బీఆ ర్ఎస్ నాయకులు రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బీఆర్ఎస్కు ప్రజల్లో స్థానం లేదు. ఆ పార్టీ నాయకులను ఎవరూ నమ్మరు' అని సీతక్క అన్నారు.