జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న జనసేన

Update: 2020-11-17 13:15 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటుందని తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నారు. 150 డివిజన్లకు గాను 35 నుంచి 40 డివిజన్లలో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో క్రియా శీలకంగా ఉన్న కార్యకర్తలు, జనసైనికులు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించినట్లు ఆయన తెలిపారు. ఆయా డివిజన్‌లలో పోటీ చేసే అభ్యర్థుల నుంచి బయోడేటను స్వీకరించామని శంకర్ గౌడ్ తెలిపారు. బీజేపీ పొత్తుతో గ్రేటర్‌లో జనసేనా సత్తా చాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News