వరంగల్‌ రూరల్‌ జిల్లాలో అదుపుతప్పి బావిలో పడిన జీప్‌

Update: 2020-10-27 13:20 GMT

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఓ జీప్‌ అదుపుతప్పి బావిలో పడింది. ఆ జీపులో 15 మంది ప్రయాణికులున్నారు. ఐతే.. వెంటనే స్పందించిన స్థానికులు.. 12 మందిని సురక్షితంగా బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. బావి నిండా నీరు ఉండడంతో.. గాలింపు కష్టమవుతోంది. సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Tags:    

Similar News