కాంగ్రెస్ పార్టీకి కౌశిక్రెడ్డి రాజీనామా..!
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.;
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఆ సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజురాబాద్ టికెట్ తనే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది.
మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే కార్యకర్తతో కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4 నుంచి 5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్కు కౌశిక్రెడ్డి సూచించారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ను కౌశిక్రెడ్డి కలిశారు.
ఈ నేపథ్యంలో ఆయన జరిపిన ఫోన్ సంభాషణ బయటకు రావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కౌశిక్ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్టాపిక్ అయింది.