బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .. రెండేళ్లుగా ఎంపీగా ఉండి.. కరీంనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కనీసం నగరానికి వచ్చిన ట్రిపుల్ ఐటీని కూడా కాపాడుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని.. ఇదేమీ తెలియకుండా.. బీజేపీ టీఆర్ఎస్ను విమర్శించడం మంచి పద్దతి కాదని కవిత అన్నారు.