KCR: పోరాటాలకు సిద్ధమవుతున్న కేసీఆర్
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై పోరు... రైతుల తరపున కేసీఆర్ పోరుబాట;
కాళేశ్వరం, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై పోరుకు బీఆర్ఎస్ రెడీ అయింది. రైతుల పక్షాన మరో పోరాటానికి గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. రైతుల కొరకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించారు. జూన్ 15న మాజీ మంత్రి హరీష్రావు, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాంటి వేళ.. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం లేఖ రాశారు. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కారణంగా గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఏంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్ట్ డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం.. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఆ లేఖలో స్పష్టం చేశారు.
రాజీపడబోమన్న సీఎం
రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. " . గోదావరి జలాలపై 2019 అక్టోబర్లో కేసీఆర్, జగన్ సమావేశమయ్యారని, గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని అన్నారు.