KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి కేసీఆర్‌

వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు... ప్రణాళికలపై చర్చించిన మాజీ సీఎం కేసీఆర్

Update: 2025-09-27 04:00 GMT

జూ­బ్లీ­హి­ల్స్‌ ఉపఎ­న్ని­క­లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వి­జ­యం సా­ధిం­చేం­దు­కు వ్యూ­హా­త్మ­కం­గా సి­ద్ధ­మ­వు­తోం­ది. ఎర్ర­వె­ల్లి­లో జరి­గిన సమా­వే­శం­లో కే­సీ­ఆ­ర్‌ కే­టీ­ఆ­ర్‌, హరీ­శ్‌­రా­వు, మహ­మూ­ద్‌ అలీ, సబి­తా ఇం­ద్రా­రె­డ్డి, పద్మా­రా­వు గౌ­డ్‌­తో వ్యూ­హా­ల­పై చర్చిం­చా­రు. కాం­గ్రె­స్‌ అమలు చే­య­ని హా­మీ­ల­ను ప్ర­జ­ల­కు గు­ర్తు­చే­సి, స్థా­నిక కా­ర్య­క­ర్త­ల­ను అప్ర­మ­త్తం చేసి ఓట­ర్ల­తో అను­సం­ధా­నం పెం­చా­ల­ని సూ­చిం­చా­రు. ఈ ఎన్ని­క­లో ప్ర­జ­లు బీ­ఆ­ర్ఎ­స్ వైపే ఉన్నా­ర­ని.. గె­లు­పు బీ­ఆ­ర్ఎ­స్‌­కు దక్కు­తుం­ద­ని కే­సీ­ఆ­ర్ ధీమా వ్య­క్తం చే­శా­రు. దీ­ని­కి సం­బం­ధిం­చి పూ­ర్తి వి­వ­రా­లు ఇలా ఉన్నా­యి.

కేసీఆర్ అధికారిక ప్రకటన

జూ­బ్లీ­హి­ల్స్‌ ని­యో­జ­క­వ­ర్గ ఉప ఎన్ని­క­లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పా­ర్టీ అభ్య­ర్థి­గా మా­గం­టి సు­నీత గో­పీ­నా­థ్‌­ను కే­సీ­ఆ­ర్‌ ప్ర­క­టిం­చా­రు. సి­ట్టిం­గ్ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్ మర­ణం­తో, త్వ­ర­లో జరు­గ­ను­న్న జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­లో.. పా­ర్టీ­లో సీ­ని­య­ర్ నే­త­గా, జూ­బ్లీ హి­ల్స్ ప్ర­జల అభి­మాన నా­య­కు­డి­గా స్థా­నం సం­పా­దిం­చు­కు­న్న ది­వం­గత మా­గం­టి గో­పి­నా­థ్ సతీ­మ­ణి మా­గం­టి సు­నీ­త­కే ప్రా­ధా­న్య­త­ని­స్తూ వా­రి­ని అభ్య­ర్ధి­గా ఎం­పిక చే­శా­రు. చి­త్త­శు­ద్ధి కలి­గిన ని­స్వా­ర్థ నే­త­గా, వారి ని­బ­ద్ధ­త­ను పరి­శీ­లిం­చిన మీదట, మా­గం­టి గో­పీ­నా­థ్ పా­ర్టీ­కి, ప్ర­జ­ల­కు అం­దిం­చిన సే­వ­ల­కు గు­ర్తిం­పు, గౌ­ర­వా­న్ని­స్తూ జూ­బ్లీ­హి­ల్స్ ప్ర­జల ఆకాం­క్షల మే­ర­కు ది­వం­గత గో­పీ­నా­థ్ కు­టుం­బా­ని­కే అవ­కా­శం ఇవ్వా­ల­ని కే­సీ­ఆ­ర్ ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. ఆయన సతీమణి మాగంటి సునీతే పోటీ చేస్తారని ఇది వరకే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అధినేత ఆమోదంతో పార్టీ ప్రకటన చేసింది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ ఇంకా విడుదల కావాల్సి ఉంది.

కేసీఆర్‌కు కృతజ్ఞతలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై సునీత పార్టీ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. మాగంటి గోపీనాథ్ పట్ల ఉన్న విశ్వాసంతో, నాపై నమ్మకం ఉంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇందుకుగానూ పార్టీ అధినేత కేసీఆర్‌కు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతు, ఆశీర్వాదం నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారామె.

ప్రజలు మన వైపే: కేసీఆర్

జూ­బ్లీ­హి­ల్స్‌­లో రా­జ­కీయ సమీ­క­ర­ణా­లు తమకు అను­కూ­లం­గా ఉన్నా­య­ని ని­వే­ది­క­లు సూ­చి­స్తు­న్నా­య­ని తె­లి­పా­రు. స్థా­నిక స్థా­యి­లో­ని శ్రే­ణు­లు ప్ర­జ­ల్లో అవ­గా­హన పెం­పొం­దిం­చి ఓట­ర్ల­తో ప్ర­త్య­క్ష సం­బం­ధా­లు పెం­పొం­దిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. కాం­గ్రె­స్‌ పా­ల­న­లో అమ­లు­కా­లే­ని హా­మీ­ల­ను ప్ర­జల ముం­దుం­చి, అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­ను వి­వ­రిం­చి నమ్మ­కం పొం­దా­ల­ని సూ­చిం­చా­రు. ప్ర­జ­లు ఇప్ప­టి­కే కాం­గ్రె­స్‌­పై వి­సు­గు­తో ఉన్నం­దున, ఇది పా­ర్టీ­కి అవ­కా­శం కలి­గి­స్తుం­ద­ని ఆయన అన్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌ ఉపఎ­న్ని­క­తో­పా­టు త్వ­ర­లో జర­గ­బో­యే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని క్షే­త్ర­స్థా­యి కా­ర్య­క­ర్త­ల­ను అప్ర­మ­త్తం చే­యా­ల­ని కే­సీ­ఆ­ర్‌ సూ­చిం­చి­న­ట్లు పా­ర్టీ వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. ప్ర­స్తు­తం బీ­ఆ­ర్‌­ఎ­స్‌, కాం­గ్రె­స్‌, బీ­జే­పీ పా­ర్టీ­ల­న్నీ ఓట­ర్ల­ను ఆక­ర్షిం­చేం­దు­కు పలు ప్ర­చార పథ­కా­లు రూ­పొం­ది­స్తు­న్నా­యి. ఈ ఉపఎ­న్నిక ఫలి­తం రా­ష్ట్ర రా­జ­కీయ సమీ­క­ర­ణా­ల­పై ప్ర­భా­వం చూపే అవ­కా­శ­ముం­ద­ని వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు.

గోపీనాథ్ మరణంతో...

మా­గం­టి గో­పీ­నా­థ్ గతం­లో మూ­డు­సా­ర్లు ఎమ్మె­ల్యే­గా ఇక్కడ నుం­చి వి­జ­యం సా­ధిం­చా­రు. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ తర­పున 2018, 2023 తె­లం­గాణ అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో పోటీ చేసి గె­లి­చా­రు. అయి­తే.. 2025, జూన్ 8వ తే­దీన ఆయన హఠా­త్తు­గా మర­ణిం­చా­రు. మర­ణా­ని­కి కొ­ద్ది రో­జుల ముం­దు.. జూన్ 5వ తే­దీన గుం­డె సం­బం­ధిత సమ­స్య­ల­తో బా­ధ­ప­డు­తూ AIG హా­స్పి­ట­ల్‌­లో చే­రా­రు. వై­ద్యు­లు ఎంత ప్ర­య­త్నిం­చి­నా ఫలి­తం లే­కుం­డా పో­యిం­ది. చి­కి­త్స పొం­దు­తూ­నే ఆయన తుది శ్వాస వి­డి­చా­రు.

Tags:    

Similar News