KCR: సభా సమరానికి "సారు" సిద్ధం..!

అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ హాజరు... హాజరవుతానని నేతలకు చెప్పిన కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై సారు దృష్టి

Update: 2025-12-28 04:00 GMT

తె­లం­గాణ మాజీ ము­ఖ్య­మం­త్రి, బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్ మళ్లీ ప్ర­జా­క్షే­త్రం­లో­కి వచ్చేం­దు­కు సి­ద్ధ­మ­య్యా­రు. ఎర్ర­వె­ల్లి ఫా­మ్‌­హౌ­స్‌­లో జరి­గిన పా­ర్టీ సీ­ని­య­ర్ నేతల సమా­వే­శం­లో ఆయన భవి­ష్య­త్తు కా­ర్యా­చ­ర­ణ­ను ప్ర­క­టిం­చా­రు. పా­ర్టీ శ్రే­ణు­ల­తో.. ఈ నెల 29 నుం­చి ప్రా­రం­భం కా­ను­న్న అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు హా­జ­ర­వు­తా­న­ని చె­ప్పి­న­ట్లు సమా­చా­రం. నీటి హక్కుల వి­ష­యం­లో కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం అవ­లం­బి­స్తు­న్న వై­ఖ­రి­ని, తె­లం­గా­ణ­కు జరు­గు­తు­న్న అన్యా­యా­న్ని సభ వే­ది­క­గా ఎం­డ­గ­ట్టా­ల­ని ఆయన ని­ర్ణ­యిం­చా­రు. పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ఎత్తి­పో­తల పథకం వంటి కీలక ప్రా­జె­క్టుల వి­ష­యం­లో ప్ర­భు­త్వం­పై ఒత్తి­డి పెం­చ­డ­మే లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు. . పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ప్రా­జె­క్టు అం­శం­పై అటు అసెం­బ్లీ సమా­వే­శా­ల్లో, ఆ తర్వాత క్షే­త్ర­స్థా­యి­లో బలం­గా పో­రా­టం చే­ద్దా­మ­ని ఆయన స్ప­ష్టం చే­సి­న­ట్లు సమా­చా­రం. కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వాల వై­ఖ­రి కా­ర­ణం­గా తె­లం­గా­ణ­కు అన్యా­యం జరు­గు­తోం­ద­ని ఆం­దో­ళన వ్య­క్తం చే­సి­న­ట్లు తె­లి­సిం­ది. పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ప్రా­జె­క్టు అం­శం­పై అసెం­బ్లీ సమా­వే­శాల తర్వాత మహ­బూ­బ్‌­న­గ­ర్‌ సమీ­పం­లో­ని మండల కేం­ద్రం­లో భారీ బహి­రంగ సభ ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చి­న­ట్లు సమా­చా­రం. అసెం­బ్లీ సమా­వే­శా­లు 15 రో­జు­లుం­డే­లా అధి­కా­ర­ప­క్షా­న్ని డి­మాం­డ్‌ చే­యా­ల­ని సమా­వే­శం­లో ని­ర్ణ­యిం­చి­న­ట్లు పా­ర్టీ వర్గా­లు తె­లి­పా­యి.

తె­లం­గా­ణ­కు రా­వా­ల్సిన నదీ జలాల వా­టా­లో కేం­ద్రం వి­వ­క్ష­ను, రా­ష్ట్ర ప్ర­భు­త్వ ని­ర్ల­క్ష్యా­న్ని అసెం­బ్లీ వే­ది­క­గా ఎం­డ­గ­ట్టా­ల­ని కే­సీ­ఆ­ర్ ని­ర్ణ­యిం­చా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ చరి­త్ర పొ­డ­వు­నా తె­లం­గా­ణ­కు ద్రో­హం చే­స్తూ­నే వచ్చిం­ద­ని, ఇప్ప­టి ప్ర­భు­త్వం కూడా అదే బా­ట­లో నడు­స్తోం­ద­ని ఆయన వి­మ­ర్శిం­చా­రు. అసెం­బ్లీ సమా­వే­శాల అనం­త­రం రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా భారీ బహి­రంగ సభలు ని­ర్వ­హిం­చి.. ప్ర­జ­ల­ను చై­త­న్య­ప­ర­చా­ల­ని పా­ర్టీ శ్రే­ణు­ల­కు ఆదే­శా­లి­చ్చా­రు. పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ఎత్తి­పో­తల ప్రా­జె­క్టు పను­ల్లో జరు­గు­తు­న్న జా­ప్యం, కేం­ద్రం నుం­చి రా­వా­ల్సిన అను­మ­తు­ల­పై రా­ష్ట్ర ప్ర­భు­త్వం సరి­గ్గా ఒత్తి­డి తీ­సు­కు­రా­వ­డం­లో వి­ఫ­ల­మైం­ద­ని బీ­ఆ­ర్ఎ­స్ ఆరో­పి­స్తోం­ది. కృ­ష్ణా నది­పై ఉన్న ప్రా­జె­క్టు­ల­ను బో­ర్డు పరి­ధి­లో­కి తీ­సు­కు­రా­వ­డా­న్ని కే­సీ­ఆ­ర్ వ్య­తి­రే­కి­స్తు­న్నా­రు. ఈ వి­ష­యా­న్ని ప్ర­జ­ల­కు బలం­గా వి­వ­రిం­చా­ల­ని ఆయన ప్లా­న్ చే­స్తు­న్నా­రు.

Tags:    

Similar News