వరంగల్లో PMSSY నిధులతో నిర్మించిన హాస్పిటల్... కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంతో ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2016లో హాస్పిటల్లో మెరుగైన సదుపాయాల కోసం కేంద్రం 120 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 కోట్ల రూపాయల వాటాలో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం వల్లే హాస్పిటల్ ప్రారంభం కావడం లేదని మండిపడ్డారు. హాస్పిటల్కు సామగ్రి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా వినియోగించడం లేదని కిషన్ రెడ్డి అన్నారు.