మాటలు కోటలు దాటుతున్నాయ్‌.. పనులు మాత్రం ప్రగతిభవన్‌ కూడా దాటడం లేదు : కిషన్‌రెడ్డి

Update: 2020-10-19 14:27 GMT

మాటలు కోటలు దాటుతున్నాయ్‌.. పనులు మాత్రం ప్రగతిభవన్‌ కూడా దాటడం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. వరదల నుంచి ప్రజలను రక్షించడంలో విఫలమయ్యారంటూ తెలంగాణ సీఎంపై విమర్శలు చేశారు. కేటీఆర్‌ రాజకీయ విమర్శలు మానాలని సూచించారు. వరద నష్టంపై ప్రభుత్వం నివేదిక పంపాక కేంద్రం కచ్చితంగా సాయం చేస్తుందని చెప్పారు. త్వరలోనే కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటిస్తాయని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు.


Tags:    

Similar News