KONDA: ఇక మాట జవదాటను: కొండా మురళి

Update: 2025-08-11 02:30 GMT

ఉమ్మ­డి వరం­గ­ల్‌ జి­ల్లా­లో హస్తం నేతల పర­స్పర ఫి­ర్యా­దు­ల­పై వి­చా­రణ చే­ప­ట్టిన కాం­గ్రె­స్ క్ర­మ­శి­క్షణ కమి­టీ ముం­దు.. మాజీ ఎమ్మె­ల్సీ కొం­డా ము­ర­ళి హా­జ­ర­య్యా­రు. తాను ఇచ్చిన వి­వ­ర­ణ­తో క్ర­మ­శి­క్షణ కమి­టీ సం­తృ­ప్తి చెం­దిం­ద­ని చె­ప్పా­రు. పా­ర్టీ ఏ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా దా­ని­కి తాను కట్టు­బ­డి ఉం­టా­న­న్నా­రు. పా­ర్టీ­కి, పా­ర్టీ పె­ద్ద­ల­కు ఇచ్చిన మా­ట­ను జవ­దా­ట­న­ని చె­ప్పా­రు. రా­హు­ల్ గాం­ధీ­ని ప్ర­ధా­ని­ని చే­యా­ల­న్న­దే తమ అం­ద­రి కో­రి­క­న్నా­రు. వరం­గ­ల్ ఇష్యూ­పై వి­వ­రణ ఇచ్చేం­దు­కు కొం­డా ము­ర­ళి గాం­ధీ భవ­న్‌­కు వచ్చా­రు. ఈ సం­ద­ర్భం­గా అక్కడ కా­స్త ఉద్రి­క్త పరి­స్థి­తి నె­ల­కొం­ది. క్ర­మ­శి­క్ష­ణా కమి­టీ కంటే ముం­దే నేనే వచ్చా­ను.. గాం­ధీ భవ­న్­కు రా­వొ­ద్దా ఏంటి అని అక్కడ పలు­వు­రి­పై కొం­డా ము­ర­ళి ఆగ్ర­హం వ్య­క్తం చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. వరం­గ­ల్ జి­ల్లా­లో కొం­డా ము­ర­ళి చే­సిన వ్యా­ఖ్య­ల­పై ఆ జి­ల్లా­కు చెం­దిన ఆయన వ్య­తి­రేక వర్గం అధి­ష్టా­నా­ని­కి ఫి­ర్యా­దు చే­సిం­ది.

Tags:    

Similar News