KRMB Latter : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ..!
KRMB Latter : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుత్ ఉత్పత్తి తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది.;
KRMB LATTER : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుత్ ఉత్పత్తి తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. సాగు, తాగు అవసరాల్లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేశారని లేఖలో కేఆర్ఎంబీ పేర్కొంది. సముద్రంలోకి వృధాగా 55.96 టీఎంసీల కృష్ణా జలాలు పోతున్నాయని, అలాగే శ్రీశైలం జలాశయం నిల్వ 94.91 టీఎంసీలకు పడిపోయిందని తెలిపింది. సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ లేఖలో ఆదేశించింది.