హైదరాబాద్కు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదన్నారు మంత్రి కేటీఆర్. ఆరేళ్లలో కేంద్రం నయాపైసా సాయం చేయలేదని విమర్శించారు. వరద సాయం ఇస్తే నోటికాడి ముద్దను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆర్కేపురం, మన్సూరాబాద్, వనస్థలిపురంలో రోడ్షో నిర్వహించిన కేటీఆర్.. విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు.