KTR : పనిమంతుడు పందిరేస్తే- కుక్కతోక తగిలి కూలిపోయిందట : కేటీఆర్ ట్వీట్

Update: 2024-11-15 13:15 GMT

పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిన చందంగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్వేశారు. హైడ్రా, మూసీ సుందరీ కరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లోని ప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ గురుకుల పా ఠశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపో వడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారన్నారు. కానీ వేది కలపై మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఫైర్అయ్యారు. ‘11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పా ఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారు. 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపో యారు. వందలాది గురుకులు, వసతిగృహాలతున్నారు. పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వం లో చలనం లేకపో వడంతో రైతన్నలు అడ్డకి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుం టున్నారు. ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైంది. అభి వృద్ది దూరమైంది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుంది. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తోంది' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News