KTR: ఓల్డ్ సిటీలో కేటీఆర్.. బహదూర్పురా ఫ్లైఓవర్తో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
KTR: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. 495 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
KTR: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. 495 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.. 108 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించిన బహదూర్పురా ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో పాతబస్తీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.. అలాగే మీర్ ఆలం చెరువు వద్ద 2.55 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ నిర్మించిన మ్యూజికల్ ఫౌంటెయిన్ను ప్రారంభించారు.. ఏ ఎన్నికలు లేకపోయినా 500 కోట్లతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామని.. ఇదే మా చిత్తశుద్ధి అని కేటీఆర్ చెప్పారు..
437 ఏళ్ల చరిత్ర ఉన్న భాగ్యనగరంలోని వారసత్వ సంపదను కాపాడతామన్నారు. అటు ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు.. సర్దార్ మహల్ రిస్టోరేషన్ పనులు చేపట్టడం సంతోకరమని చెప్పారు. బహదూర్పురా ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయన్నారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.. పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తున్న మంత్రి కేటీఆర్కు అసదుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.