KTR : కేటీఆర్ పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలి : పట్నం

Update: 2024-08-27 13:15 GMT

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గెస్ట్‌ హౌస్‌ నిర్మించుకున్నానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. హిమాయత్‌ సాగర్‌లో నిర్మించిన గెస్ట్‌ హౌస్‌పై ఆయన వివరణ ఇచ్చారు. చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. తన గెస్ట్ హౌస్ అక్రమమని తేలిదే కూల్చేస్తామని స్పష్టం చేశారు. 111 జీవో పరిధిలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు. పట్టా భూమిలోనే తన గెస్ట్‌ హౌస్‌ ఉందని.. ప్రభుత్వం అనుమతిస్తేనే నిర్మించుకున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్‌ మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

Tags:    

Similar News