భారీ వర్షానికి అతలాకుతలమైన మల్కాజ్గిరి ప్రాంతంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మైనంపల్లి కలిసి.. కాలనీలన్నీ తిరిగి స్థానికుల బాధలు తెలుసుకున్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని కేటీఆర్ చెప్పగా... స్థానికులు వాటిని కూల్చేయాలంటూ పట్టుబట్టారు. దాదాపు 400 నిర్మాణాలను కూల్చేందుకు తాము సిద్ధమేనని.. అయితే ఎవరైనా గొడవ చేస్తే.. ప్రజలు ప్రభుత్వం పక్షాన నిలవాలని కేటీఆర్ కోరారు. స్థానికులంతా దీనికి సరే అని భరోసా ఇచ్చారు.