వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూల అమ్మకం కలకలం రేపింది. తేమ సరిగా ఆరకుండానే బూజు పట్టిన లడ్డూలను సిబ్బంది అమ్ముతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. లడ్డూలు తీసుకొచ్చే ట్రేల నుంచి దుర్వాసన వస్తోందని మండిపడుతున్నారు. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని ఇలా విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రసాదాల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.