నల్గొండ జిల్లాలో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తా పడింది. అనంతరం అక్రమార్కులు ఆ లారీని జేసీబీ సహాయంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. పీడీఎస్ బియ్యం అక్కడే వదిలేసి వెళ్లారు. దీంతో స్థానికులు బియ్యం బస్తాల కోసం ఎగబడ్డారు. సుమారు 250 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద చోటుచేసుకుంది.