ఎన్ఆర్ ఎస్ గడువును పెంచ బోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి మాట్లాడుతూ... ఎల్ఆర్ఎస్ స్కీం గడువు పూర్తికి మార్చి 31 వరకు అవకాశం ఉందని, ఆ లోగా చేసుకున్న వారికి 25% డిస్కౌంట్ ఇస్తామని అన్నారు. ఎల్ఆర్ఎస్ కాకుండా ఇల్లు కట్టటప్పుడు పర్మిషన్ కావాలంటే వందశాతం ఎస్ఆర్ఎ స్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. భూ సర్వే కోసం ప్రతి మండలానికీ ఓ సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ ను నియమించబోతున్నట్టు చెప్పారు. అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తామని అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు చాన్స్ ఇస్తామని వివరించారు. తనకు ఏ ఎమ్మెల్యేతోనూ విబేధాల్లేవని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డితో ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుధ్ చెబుతున్న అభిమన్యు రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని అన్నారు. సాదా బైనామాల విషయంలో కొత్త దరఖాస్తులు స్వీకరించబోమని చెప్పారు. పాత దరఖాస్తుల్లో 13 లక్షల దరఖాస్తులను గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని చెప్పారు. రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అధారిటిలో ఆపిల్ చేసుకోవచ్చునని చెప్పారు.