వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మళ్లీస్ పార్టీ ముస్లిం పర్సనల్ లా బోర్డు సంయుక్తంగా నగరంలో మానవహారం నిర్వహించి, తమ నిరసన వ్యక్తం చేశాయి. వర్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు మజ్లిస్ పార్టీ ఇంకా పలు ముస్లిం సంఘాలు సంయుక్తంగా న్యాయపరంగా, ప్రజాపోరాటాలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో మానవహారాలు నిర్వహించారు. కంచన్ బాగ్ సమీపంలోని ఒవైసీ ఆసుపత్రి చౌరస్తా నుంచి చాంద్రాయణగుట్ట ఫ్లైవోవర్ వరకూ నిర్వహించిన మానవహారంలో మజ్లిస్ పార్టీశాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆ పార్టీకి చెందిన పలువురు కార్పోరేటర్లు ఇతర నాయకులూ పాల్గొన్నారు. సుమారు మూడు కిలో మీటర్ల పొడవున నిర్వహించిన మానవహారంలో మహిళలు, ముదుసలి వాళ్ళూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్స్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలూ తమ నియోజక వర్గం పరిధిలోని ప్రధాన రహదారులపై మానవహారం చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మజ్లిస్ పార్టీ ముస్లిం పర్సనల్ లా బోర్డు రెండు రోజుల క్రితం మాసాబ్ ట్యాంక్ లోని హాకీ స్టేడియంలో మహిళలతో బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు దారుల్సలాంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ముస్లింలు హాజరయ్యారు.