TG : కొడంగల్ కు మెడికల్ కాలేజీ : మంత్రి దామోదర రాజ నర్సింహ

Update: 2024-12-19 15:00 GMT

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చే స్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వచ్చే అకాడ మిక్ ఇయర్ నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఆయన వెల్లడిం చారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆరోగ్యరంగానికి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమి చ్చారు. ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీల ను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు. ‘ఒక్కో కాలేజీలో 50 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని కాలేజీల్లో ఎన్ఎంసీ నిబం ధనలకు అనుగుణంగా ఫాకల్టీని నియమి స్తాం. అన్ని హాస్పిటల్లో కలిపి 2500లకు పైగా డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాల మెయింటనన్స్, రిపేర్లకు స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశాం. అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కానింగ్ సర్వీసులు అందు బాటులోకి తీసుకొస్తాం. కేన్సర్ స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ సర్వీసులు అం దుబాటులోకి తీసుకొస్తాం. రీజనల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తం. ప్రభుత్వ హాస్పిట ళ్లకు ప్రజలే యజమానులు. సిటీతో పాటు, జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నం. ఇందులో భాగంగా కొంతమంది సీనియర్ డాక్టర్లను జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశాం. రాబోయే రోజుల్లో 90 శాతం ట్రీట్మెంట్ జిల్లాల్లోనే అందేలా చర్యలు తీసుకుంటాం' అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Tags:    

Similar News