సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారు. పెద్ద శంకరం పేటలో డబుల్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి, తరువాత నిజాంపేట్లో 96 డబుల్ బెడ్ రూం ఇండ్లను, రైతు వేదికను ప్రారంభించారు. ఎవరి జాగాలో వారు ఇళ్లు కట్టుకుంటే ప్రభుత్వం తరపున డబ్బులు ఇప్పిస్తామన్నారు. ఈ ఏడాదే చేయాలి అనుకున్నా ప్రభుత్వానికి కరోనా దెబ్బ తగిలింది అన్నారు. ప్రభుత్వం ఖర్చు పెరిగి ఆదాయం తగ్గినా ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని గుర్తు చేశారు. బియ్యం పంపిణీ, నెలకు రెండు వేల ఆసరా పెన్షన్, రైతులకిచ్చే 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బందు పైసలు ఏదీ ఆపలేదన్నారు.