Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి కీలక ఆదేశాలు

Update: 2025-05-03 09:30 GMT

ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయిం చిన 3,500 ఇండ్లకు లబ్ది దారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశిం చారు. లబ్దిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏరోజుకారోజు ఇన్ఛార్జి మంత్రుల నుంచి లబ్దిదారుల జాబితాకు ఆమోదం తీసుకో వాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం నాడు చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణరావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి పొంగులేటి. అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేస్తామన్నారు. లిస్ట్-1, లిస్ట్-2, లిస్ట్-3 లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు. గత నెల 17 నుంచి 30 వరకు నాలుగు మండలాల్లో నిర్వహిం చిన మాదిరిగానే ఈనెల 5 నుంచి 20 వరకు జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహి స్తున్నామని తెలిపారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31లోగా పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందు కు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియ జేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు. 605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో అవ గాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందని ఇందులో 85,527 మంది పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేనివారి వివరా లను సేకరించాలని సూచించారు.

Tags:    

Similar News