Bonalu Festival : భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలకు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

Update: 2024-07-26 15:28 GMT

భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ ధర్మకర్తలు/దేవాదాయశాఖ అధికారులు ఈ రోజు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి బోనాల ఉత్సవానికి ఆహ్వానించారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లపై ఆరాతీసిన మంత్రి.. భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలకు హైదరాబాద్ వ్యాప్తంగా భక్తులు హాజరవుతారని.. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బోనాల కార్యక్రమంలో మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు.ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ బాలాజీతో పాటు.. ఆలయ ట్రస్టీ కుమారి శశికళ, సూర్యప్రకాశ్, జానకి శరణ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News