ఈ నెలలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే రెండు లక్షల పైన వారికి కూడా విడతల వారీగా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నల్గొండ జిల్లాలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ సమీపంలో మీ బత్తాయి మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పత్తి కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. అనంతరం సాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు ఆలియా మార్కెట్ కమిటీ ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మార్పు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు.