అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో తేల్చుకోవాలి : మంత్రి కేటీఆర్

Update: 2020-11-27 09:17 GMT

అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు మంత్రి కేటీఆర్‌. గత ఆరేళ్లలో తెలంగాణకు కేంద్రం ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నించారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన కేటీఆర్‌.. మతం అన్నం పెడుతుందా అని ప్రశ్నించారు. పాతబస్తీల్లో రోహింగ్యాలు ఉన్నారని ఆరోపిస్తున్నారని.. మరీ వారికి ఆధార్‌ కార్డులు ఇచ్చింది కేంద్రం కాదా అని నిలదీశారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. 

Tags:    

Similar News