సురవరం ప్రతాపరెడ్డి పేరును త్వరలోనే ఒక యూనివర్సిటీకి పెడుతాం : కేటీఆర్
తెలంగాణ ఆవిర్భవించక పోతే ఇలాంటి ఎంతో మంది మహానుభావుల గురించి భవిష్యత్ తరాలకు తెలిసి ఉండకపోయేదేమో అని అన్నారు.
ఎంతకాలం జీవించామన్నది కాదు ఎలా జీవించామన్నదే ముఖ్యమన్నారు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సురవరం చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సురవరం ఒక సంఘ సంస్కర్తగా, సంపాదకుడిగా, కవిగా, రచయితగా, సేవలందించారని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భవించక పోతే ఇలాంటి ఎంతో మంది మహానుభావుల గురించి భవిష్యత్ తరాలకు తెలిసి ఉండకపోయేదేమో అని అన్నారు. సరవరం ప్రతాపరెడ్డి పేరును కూడా ఒక యూనివర్సిటీకి పెడుతామని ఈ సందర్భంగా తెలిపారు.