తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు.
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్చలు జరుగుతున్నాయన్నారు. మొదటి దశలో 600 బస్సులు IKP ద్వారా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను మంత్రి ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.