TG : నయీం ఫ్యామిలీ వివరాలు సర్వేలో నమోదు చేసిన మంత్రి పొన్నం

Update: 2024-11-15 11:45 GMT

సమగ్ర కుటుంబ, కులగణన సర్వేలో భాగంగా మహ్మద్ నయీం కుటుంబ సభ్యుల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నమోదు చేశారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఎన్‌క్లేవ్ అపార్ట్మెంట్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మితో కలిసి మంత్రి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి వివరాలు నమోదు చేశారు. ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన పాలన అందించేందుకు సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. సర్వే విషయంలో ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఎక్కడా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ సర్వే దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం సర్వే పూర్తైందని చెప్పారు. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు.. ఇంకా పథకాలు అమలవుతాయి.. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. 

Tags:    

Similar News