Mission Bhagiratha : మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదా..?1916కి కాల్ చేయండి

Update: 2025-06-19 11:00 GMT

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని మిషన్ భగీరథ తాగునీటి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల స్వీ కరణ కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నంబర్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న 18005994007 (11అంకెల) టోల్ ఫ్రీ నంబర్ కు బదులుగా నాలుగు అంకెల 1916 (4అంకెల నంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు ఈ మార్పులు చేశారు. ప్రజలకు సులువుగా గుర్తుండేలా ఈ నూతన నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నాలుగు అంకెల 1916 టోల్ ఫ్రీ నంబర్ తో ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తమ తాగునీటి మిషన్ భగీరథ సమస్య ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ ను హైదరాబాద్ మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసి 24/7 పని చేసేలా చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి టోల్ ఫ్రీ ద్వారా వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ సిబ్బంది పరిష్కరిస్తున్నారు.

Tags:    

Similar News