యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ను ఆర్డీవోతో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహకారం ఉంటుందని ఆయన సిబ్బందికి సూచించారు.