తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై గవర్నర్ వినిపించిన ప్రసంగానికి దశ, దిశ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారపూ చితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హామీలపై ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మహిళా జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్ లను వెంటనే విడుదల చేయాలని కోరారు. అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మహిళా జర్నలిస్టుల పెట్టిన వీడియోను సభ ముందు పెడితే వాళ్లు తప్పు మాట్లాడారా కరెక్టు మాట్లాడారా అందరికి తెలుస్తుందన్నారు. తమకు జర్నలిస్టుల అంటే గౌరవం ఉందన్నారు. అదే భాష మీ మీద మాట్లాడితే ఊరుకుంటరా అని మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సొంత పేపర్, ఛానెల్ పెట్టుకోలేదని స్పష్టంచేశారు. జర్నలిస్టులు మంచిని మంచి, చెడులు రెండూ రాయాలని సూచించారు.