తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకురాలు, MLC కవిత ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని KBR పార్కులో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న కవిత తొలుత భోగి మంటలు వేశారు. అనంతరం పిల్లలకు భోగి పళ్ళు పోశారు. గాలి పటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు.