జూబ్లీహిల్స్ పెద్ధమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత
గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహిస్తోన్న "కుంభ సందేశ్ యాత్ర" ను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు.;
భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే ఆర్గదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహిస్తోన్న "కుంభ సందేశ్ యాత్ర" ను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను కొత్త తరానికి చేరవేయడంతో పాటు ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ సందేశ్ యాత్రను నిర్వహిస్తోన్న వసంత్ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కూడ పాల్గొన్నారు.