గ్రేటర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై... వివాదం అవుతోంది. గత ఏడాది నిజామాబాద్లో ఓటు వేసిన కవిత.. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఓటు వేస్తారంటూ బీజేపీ ప్రశ్నించింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం క్రమంగా తీవ్రమవుతుండడంతో.. ఎస్ఈసీ వివరణ ఇచ్చింది. కవిత నిజామాబాద్లో ఓటు రద్దు చేసుకున్నారని తెలిపారు.