వేములవాడ రాజన్న ఆలయంలో ఆధునిక గోశాల నిర్మించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సచివాలయంలో మంగళవారం సాయంత్రం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ గోశాల ఏర్పాటుకు వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్లు సీఎంకు వివరించారు.