ప్రతీ ఏటా మాదిరిగానే అడ్రస్ లేకుండా పోయింది నైరుతి. ఈ ఏడాది ముందస్తు మురిపెంగా రాష్ట్ర వ్యాప్తంగా మే మూడో వారంలోనే భారీ వర్షాలు కురిశాయి. దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో సంతోషంగా అన్నదాతలు వానా కాలం సాగుకు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. పక్షం రోజులు ముందుగానే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు, విత్తనాలు సమకూర్చు కున్నారు. కొన్ని జిల్లాల్లో రైతులు పత్తితోపాటు కంది, మొక్క జొన్న తదితర విత్తనాలు కూడా విత్తారు. సాధారణంగా విత్తనాలు నాటిన వారం రోజులకు విత్తనం మొలకెత్తాలి. అయితే పది రోజులుగా మేఘాల్లోని చినుకు భూమికి చేరకపోవడంతో భూమిలో వేసిన విత్తనం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఇంకా చాలా జిల్లాల్లో దుక్కులు సిద్ధం కావడంతో విత్తనం వేద్దా మనుకునే సరికి వరణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామీణ జిల్లాల్లో వారం, పది రోజులుగా వర్షాలు కురవడం లేదు. వర్షాలు కురవకపోయినా వాతావరణం చల్లబడుతుందనుకుంటే అదీ లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి రాష్ట్రంలో భిన్నంగా ఉంది. పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో 15రోజులు ముందే వానాకాలం ప్రారంభమైనా రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ఏటా జూన్ రెండోవారంలో కనీసం తొలకరి చినుకులు ప్రారంభమై వాతావరణం చల్లబడుతుంది. సాధారణంగా ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయి. వానా కాలం సాగును కూడా అన్నదాతలు మృగశిరకార్తె అనంతరం మొదలుపెడతారు. మృగశిర కార్తె రాకతో వాతావరణం చల్లబడు తుందని, ఆ వాతావరణంలో విత్తనం పడితే దిగుబడి బాగా వస్తుందని అన్నదాతలు భావిస్తారు. అయితే రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. పది రోజులు గా ఎండలు దంచి కొడుతుండడంతో దుక్కి దున్నులు తడారిపోతున్నాయని, వారం రోజులుగా కనీసం ఒక్క వర్షం కూడా కురవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.