Konda Vishweshwar Reddy : తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణం కానుకగా సమర్పించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి...

Update: 2025-09-23 11:45 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ విరాళాన్ని సమర్పించారు. దాదాపు రూ.60 లక్షల విలువైన "అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి" అనే అత్యంత అపురూపమైన స్వర్ణ కంఠాభరణాన్ని స్వామివారికి కానుకగా అందించారు.

కాగా ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అందించిన ఈ ఆభరణం 535 గ్రాముల బరువు ఉందని తెలిపారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈ విరాళాన్ని అందుకున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News