కేంద్రం తీరుపై ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు

Update: 2020-11-27 08:58 GMT

కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతోంది అని అన్నారు. గత ఆరేండ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అసలు హైదారాబాద్ అభివృద్ధిపై స్థానిక బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడారా అని నిలదీశారు. బీజేపీ నేతల మోసపు ప్రచారాలను ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై లెక్కలు తేల్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు నామా నాగేశ్వరరావు.  

Tags:    

Similar News