Telangana: కొత్తగా 354 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.;
తెలంగాణలో కొత్తగా 354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 74,634 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,55,343కి చేరింది. కరోనాతో బారిన పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,861కి చేరింది. కరోనా నుంచి రికవరీ కేసుల సంఖ్య 427 గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.44శాతంగా ఉంది.