రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వానాకాలం 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నారు. సన్న వడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు ఉత్తమ్. ప్రోత్సహకంగా సన్న వరి ధాన్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామన్నారు.